I Hate Growing Up...

I Hate Growing Up...

Whiten Your Teeth With Banana Peel

Whiten Your Teeth With Banana Peel

Childhood made me happy...

Childhood made me happy...

Memories of childhood were the dreams that stayed with you after you woke

Memories of childhood were the dreams that stayed with you after you woke

Childhood is the most beautiful of all life's seasons

Childhood is the most beautiful of all life's seasons

School Life



Childhood Best Friends

Childhood Best Friends

I Just Want My Childhood Back

I Just Want My Childhood Back





Childhood Unforgettable Moments

Childhood Unforgettable Moments

Childhood Unforgettable Moments

Childhood Unforgettable Moments

Childhood Unforgettable Moments

Childhood Unforgettable Moments

Management VS Employee

ManagementVSEmployee

Good Idea

Good Idea

Learn New Language-Silent Language Signs

Learn New Language-Silent Language Signs

KCR-Public Representatives Salaries Hiked From April-2015 Onwards

KCR-Public Representatives  Salaries Hiked From April-2015 Onwards

DSC+TET will be Soon...

DSC+TET will be Soon...

Cricket World Cup Highlights-2015

Cricket World Cup Highlights-2015

ACB Contact Details

ACB Contact Details

Telangana She Team Help Line No :181

Telangana_She_Team_Help_Line_No_181

Engineering Students Project Review

Engineering Students  Project Review

Don't Forget Hindu Culture-Save Hindu Culture

Don't Forget Hindu Culture-Save Hindu Culture

Super Star Krishna Golden Jubilee Year-50 Years

Super Star Krishna Golden Jubilee Year-50 Years

Super Star Krishna Golden Jubilee Year-50 Years



Maxwell with Tendulkar

Maxwell with Tendulkar

Citizen-Police Connect Program By Cyberabad Police

Citizen-Police Connect Program By Cyberabad Police

RTI

RTI

An Idea Can Change Your Life..LOL

An Idea Can Change Your Life..LOL

KCR-Rupees 1000 Pension for Beedi Workers from April-2015 Onwards

KCR_Rs1000_pension_for_beedi_workers

KCR-Shadi Mubarak Scheme for Muslims

KCR-Shadi Mubarak Scheme for muslims

KCR-Pentions for all...

KCR_pentions for all

KCR-24 Hrours Power In Telangana

KCR_24hrs_power_in_telangana

RTI---Right To Information Act

సమాచార హక్కు

ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థల నుంచి సమాచారాన్ని అడిగి తీసుకునే అధికారమే సమాచార హక్కు (Right to Information). 12 అక్టోబర్ 2005 తేదీన ఈ సమాచార హక్కు చట్టం భారతదేశమంతటా అమలులోకి వచ్చింది. దీనిని ఉపయోగించుకొని, ప్రభుత్వ పనులపై సమచారాన్ని పొందవచ్చు. ఇంతకుముందు పార్లమెంటు, లేక విధాన సభ లేక విధాన పరిషత్ సభ్యులకు గల ఈ సౌకర్యాన్ని, ఈచట్టం ద్వారా ప్రజలందరికి కలిగింది,. ప్రభుత్వ అధికారులు అడగకపోయినా వారంతట వారే విధి విధానాలు, ఉద్యోగుల బాధ్యతలు మొదలైన 16 అంశాల గురించి సమాచారం ఇవ్వాలి. దీని ప్రకారం ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో సహాయ పౌర సమాచార అధికారి, పౌర సమాచార అధికారి, అప్పిలేట్ అధికారుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లను, ప్రజలకు కనిపించే విధంగా బోర్డుమీద స్పష్టంగా రాసి ఉంచాలి.
మాచార హక్కు చట్టం ప్రచారమే ప్రాణం;
ఒక వ్యక్తికి మాట్లాడే హక్కు, స్వాతంత్య్రపు హక్కు, జీవించే హక్కు ఉన్నప్పుడు సమాచారాన్ని అడిగి అదిపొందే హక్కు ఉంటే తప్పేమిటి? అసలు సమాచారం అడగడమే సాహసోపేతమైన విషయం. ఇలాంటి సమస్యలు గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా ఎస్సి, ఎస్టి, బడుగు, బలహీన వర్గాలవారికి ఎప్పుడూ తారసపడుతూనే ఉంటాయి. సమాచారం ఎందుకివ్వాలి? ఆ సమాచారం నీకెందుకు ఉపయోగపడుతుందని అదిరించి, బెదిరించే బడా బాబులు గ్రామీణ ప్రాంతంలో ఉన్నారు. చట్టాలు, న్యాయాలు వారికి పట్టవు. చట్టాన్ని చుట్టంగా మలుచుకొని అగ్రకుల నీడల్లో బతుకుతూ గ్రామీణా భివృద్ధిని అడ్డుకుంటుంటారు. నేటి గ్రామీణ భారతంలో ఇదే జరుగుతోంది. ఒక్క గ్రామీణ సమాజంలోనే కాదు, ప్రతిచోట పాలనా ద క్షత, పరిపాలన, సమన్యాయం, సమాజాభివృద్ధి, విద్య, వైద్య ఆరోగ్యాలపై ఈ ప్రభావం కనబడుతూనే ఉంది.
కొన్ని మారుమూల ప్రాంతాల్లోని అగ్రకుల నాయకు లు పంచాయి తీలను, గ్రామ నౌకర్లను, ఇతర ఉద్యోగులను తమ చెప్పు చేతుల్లో ఉంచుకొని ప్రజా జీవితాన్ని, ప్రజాధనాన్ని, ప్రజలకోసం ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాల్ని మింగేస్తుంటారు. ఇలాంటప్పుడు ప్రభుత్వంనుండి, లేకఅధికారులనుండి సమాచారం అడిగినప్పుడు సమర్ధవంతమైన, నాణ్యమైన పరిపాలనతో సమాచారం అందించగలిగే పరిస్థితులు ఎక్కడ కనపడుతాయి? స్వాతంత్య్రం అనంతరం మన దేశంలో సమాచారం పొందేందుకు అనేక చట్టాలు చేశారు. కాని అవి ఏ మాత్రం ఉపయోగపడలేదని చెప్పాలి. కాని ఇప్పుడు ఎక్కడ కావాలన్నా, ఎప్పుడు కోరుకొన్నా సదరు సమాచారాన్ని పొందే హక్కును ప్రభుత్వాలు కల్పించాయి. సమాచార హక్కు చట్టం- 2005 ప్రజల చేతిలో వజ్రాయుధమైంది. కేవలం ఇక్కడ ప్రజలు మార్పుని గమనించి అవగాహనతో ముందడుగు వేశారు.ఇప్పుడు ‘చట్టం’- కొందరు కామందుల చేతిలో చుట్టం కాదని, పేదవాడి గుండె చప్పుడని నిరూపించింది. పౌర సరఫరాలు, ప్రజా సంబంధాలు, వైద్యం, ఆరోగ్యం, పారిశుద్ధ్యం, విద్య- ఇలా అన్ని శాఖల పనితీరును ప్రశ్నించింది.
డొల్ల తనాన్ని బయట పెట్టింది. సుపరిపాల న, స్వచ్ఛమైన,నీతివంతమైన, దాపరికంలేని పాలన అందించింది. అవినీతిని అంతమొందించ డానికి సంబంధిత వ్యక్తులకు ప్రజలపట్ల జవాబుదారి తనాన్ని కలిగించే ఉద్దేశంతో, ప్రజలను భాగస్వాములుగా చేసి సమాచార హక్కు చట్టం ద్వారా వీలు కల్పించింది. జులై 2004న అప్పటి ప్రభుత్వం జాతీయ సలహా మండలిని ఏర్పాటు చేసింది. ఈ జాతీయ సలహామండలి సమాచార హక్కు చట్టం ముసాయిదాను తయారుచేసి 2004 డిసెంబర్ 23న లోక్సభలో ప్రవేశపెట్టించింది. 2005 మే11 న లోక్సభలో ఆమోదం పొందిన సమాచార హక్కు చట్టం 2005 మే 12న మన రాజ్యసభలో ఆమోదం పొందింది. ఆ తరువాత రాష్ర్టపతి ఆమోదం పొంది 2005 జూన్ 21న గజెట్లో ప్రచురితమైంది. అప్పటి నుండి‘ సమాచారహక్కు చట్టం- 2005’ పౌరులకు సమాచారహక్కును కల్పిస్తోంది. ఈ హక్కు ద్వారా అధికార యంత్రాంగాల వద్దఉన్న సమాచారాన్నిపౌరులు పొందగలరు.తద్వారా ప్రభుత్వ యం త్రాంగాల పనితీరులు,పారదర్శకత, జవాబుదారితనం పెరుగుతాయి.ఆయారాష్ట్రాలు లక్ష్య సాధనకోసం రాష్ర్ట సమాచార కమిషన్లనుకూడా ఏర్పాటు చేసుకున్నాయి.
ఈ చట్టం అమలులోనికి వచ్చిన120 రోజులలో సంబంధిత ప్రభుత్వశాఖలు తమకు సంబంధించిన సమాచారాన్ని అందించడంకోసం తగిన ఏర్పాట్లు చేసుకున్నాయి. ప్రభుత్వ పాలన ప్రజల బాగుకోసం, ప్రజల సొమ్ముతోనే సాగుతుంది. అందుచేత ప్రజలకు తెలియకుండా పాలన సాగటంఎంతవరకు సమంజసం? పరిపాలనలో పారదర్శకత లేకుంటే పాలన చీకటిలో సాగుతున్నట్లే భావించాలి. క్రీయాశీల పాత్ర పోషించాల్సిన ప్రజలను ప్రేక్షకులుగా మార్చినట్లవుతుంది. అలాంటప్పుడు ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుంది? అందువల్ల సమాచార హక్కు పాలనాసంస్కరణల్లో చాలా కీలకమైనది. ప్రభుత్వం వద్దనున్న ప్రజలకు సంబంధించిన సమాచారం పొందేందుకు ప్రతి పౌరుడికి ఇప్పుడు చట్టబద్ధమైన హక్కు ఉన్నది. రికార్డులు, ఫైళ్ళు, రిజిస్టర్లు, మ్యాప్లు, డేటా, ఎలక్ట్రానిక్లేదా కంప్యూటర్లలో నిక్షిప్తమైయున్న సమాచారాన్ని పొందటానికి ఇప్పుడు పౌరులకు హక్కు ఏర్పడింది. అన్ని అధికార కార్యాలయాల్లో ఈ చట్టం ప్రకారం సమాచారం కోరే ప్రశ్నలకు దానిని అందించడం కోసం పౌరసమాచార అధికారులను నియమిస్తారు.సక్రమ విధి నిర్వహణ కోసం పౌర సమా చార అధికారి, ఆ కార్యాలయంలోని మరో అధికారిని కోరినప్పుడు ఆ సహాయం అందించాలి.
సమాచారం కోసం వచ్చినప్రతి అభ్యర్ధనను పౌరసమాచార అధికారులు పరిశీలిం చాలి. లేదా చట్టంలోని సెక్షన్ 8 లేదా 9 ప్రకారం సమాచారం నిరాకరించిన విషయాన్ని అయినా రాత పూర్వకంగా తెలియజేయాలి. సమాచారం కోసం దరఖాస్తుదారుడు దరఖాస్తు చేసినప్పుడు దానితోపాటు నిర్ణీత రుసుం చెల్లించాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ర్ట ప్రభుత్వం దరఖాస్తు రుసుం విషయంలో తేది ఒక ఉత్తర్వును జి.ఒ.యం.యస్.నెం.454, జి.ఎ. (పే అండ్ పి.ఆర్) జారీ చేసింది. ఆ ప్రకారం దరఖాస్తుతో పాటు రుసుంగా నగదుగాని, డి.డి. గాని, బ్యాంకర్స్ చెక్గాని అందజేయవచ్చు. చట్టం చుట్టపు చూపులుగా ఉండకూడదు. ప్రజల చేతిలో జ్యోతివలె సమాజానికి వెలుగు ఇచ్చేలా చూడాలి. ఆంధ్రప్రదేశ్ సమాచార కమిషన్ తన 2009 వార్షిక నివేదికను రాష్ర్ట శాసనసభలో ప్రవేశపెట్టింది.
ఆ ప్రకారం 2009 లో దాఖలైన మొత్తం దరఖాస్తులు 65,973, పెండింగ్లో ఉన్నవి 9,831 మొత్తం 75,804 దరఖాస్తులు. వీటిలో దాదాపు 67,021 పరిష్కారమయ్యాయి. దీనినిబట్టి ఈ చట్టం గురించి ప్రజలకు తెలిసిన సమాచారమెంత? గ్రామీణ ప్రాంతాలను ప్రక్కన పెడితే పట్టణాలు, నగరాల పౌరులకు సైతం ఏ మాత్రం సమాచారహక్కు చట్టం గురించి తెలుసు, ఎంతమేరకు ఉపయోగించు కుంటున్నారన్నది ప్రశ్న. ఇప్పుడు మన చేతికి వచ్చిన ఈ వజ్రాయుధం న్యాయమూర్తులను, అత్యున్నత పదవులను అధిష్ఠించిన వారిని సైతం వదలడం లేదు.ఇంత కఠినంగా, గొప్పగా, సమర్ధవంతంగా చట్టం అమలు ఉంటే సమాచారహక్కు చట్టం గురించి ప్రజలలో ప్రచారం చేయవలసిన అవసరం ఉంది.

Sri Kodanda RamaSwamy Temple,Ontimitta,Kadapa


Sri Kodanda RamaSwamy Temple,Ontimitta,Kadapa

Sri Kodanda RamaSwamy Temple,Ontimitta,Kadapa

శ్రీరాఘవం దాశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం!
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి!!

అంటూ శ్రీరామ నామ స్మరణతో మారుమ్రోగుతున్న దివ్య క్షేత్రం ఒంటిమిట్ట. ఏకశిలానగరంగా రాష్ట్రంలో ఉన్న శ్రీరాముని పురాతన ఆలయాలలో ఒకటిగా దేశంలో ఉన్న శ్రీరాముని ఆలయాలలో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న ఈదివ్య క్షేత్రంలో సాక్షాత్తూ కోదండరామ స్వామి వారు సీతాలక్ష్మణ సహితంగా కొలువై భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. ఈ ఆలయానికి కొన్ని వందల సంవత్సరాల నాటి చరిత్ర ఉంది. అత్యంత పురాతనమైన ఈ దివ్యాలయానికి 11వ శతాబ్దం నాటి చోళరాజులు, విద్యానగర రాజులు, మట్టి రాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలు ఇచ్చినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఒంటిమిట్టకు చేరుకున్న భక్తులు ముందుగా ఇక్కడ సమీపంలోని రామతీర్థానికి చేరుకొని స్నానాదికాలు చేస్తారు. అత్యంత మహిమాన్వితమైన ఈ రామతీర్థాన్ని స్వయంగా శ్రీరామచంద్రుడు తన బాణంతో ఏర్పాటు చేశాడని చెప్తారు. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ప్రకృతి అందాలను ఆవిష్కరించే ఈ రామతీర్థంలో స్నానమాచరించే భక్తుల ఈతిబాధలన్నీ మటుమాయం అవుతాయని చెప్తారు. ఈ రామతీర్థంలో లక్ష్మణ తీర్థం కూడా భక్తులకు దర్శనమిస్తుంది. రామలక్ష్మణ తీర్థాలను ఆనుకొని బమ్మెర పోతనామాత్యునికి చెందినవిగా చెప్పబడుతున్న పంటపొలాలు దర్శనమిస్తాయి. సుప్రసిద్ధ కవిపండితులు బమ్మెర పోతనామాత్యులు ఈక్షేత్రంలోనే భాగవత రచన చేసి ఇక్కడ కొలువైన కోదండ రామునికి అంకితమిచ్చినట్లు పురాణాల ద్వారా అవగతమౌతోంది.

అతి పురాతనమైన ఈ ఆలయాన్ని మూడు దఫాలుగా నిర్మించినట్లు శాసనాలద్వారా అవగతమౌతోంది. చోళరాజులు, విద్యానగర రాజులు, మట్టి రాజుల పరిపాలనలో ఈ ఆలయం అంచెలంచెలుగా అభివృద్ధి చెందినట్లు తెలుస్తోంది. విద్యారణ్య ప్రభువులు, సదాశివ రాయలు, చోళ రాజులు ఈ ఆలయానికి అనేక మాన్యాలు ఇచ్చినట్లు శాసనాల ద్వారా తెలుస్తోంది. అతి పురాతనమైన ఈ దివ్యాలయం విశాలమైన ప్రాంగణంలో దర్శనమిస్తుంది. మనోహరమైన శిల్ప రాజాలను దర్శింపజేస్తుంది. ఈ ఆలయ ప్రాకారం, గోపురాలపై చోళుల నాటి శిల్పకళా వైభవాన్ని భక్తులు తనివితీరా దర్శించుకుంటారు. విశాలంగా, ప్రశాంతంగా ఉన్న ప్రధాన ఆలయ ప్రాంగణంలో స్వామివారి గర్భాలయానికి ముందు భాగంలో ఆ కాలంనాటి ధ్వజస్తంభం ఒకటి దర్శనమిస్తుంది. దీని దర్శనభాగ్యం చేతనే సమస్త భాగ్యాలూ సొంతమౌతాయని భక్తులు విశ్వసిస్తూ ధ్వజస్తంభాన్ని భక్తితో పూజిస్తారు. అనంతరం ముఖమండపంలోకి ప్రవేశిస్తారు.

ఈ క్షేత్రానికి సంబంధించి ఓ జానపద గాథ ప్రచారంలో ఉంది. పూర్వం ఒండుడు, మిట్టుడు అనే ఇద్దరు సోదరులైన దొంగలు ఈ పరిసర గ్రామంలో దోపిడీ చేసేవారట. వారు దొంగిలించిన వస్తువులను ఈక్షేత్రంలో ఉన్న గుహలలో దాచేసేవారట. అప్పుడు ఈ గుహలో శిలపై ఉన్న సీతారామ లక్ష్మణులు ఆ దొంగలకు హితోపదేశం చేసి నిజాయితీగా బ్రతకమని ఆదేశించారట. దాంతో మనస్సు మార్చుకున్న ఆ దొంగలు ఆ విగ్రహాలకు గర్భగుడి, అంతరాలయం నిర్మించారట. ఆకారణంగా ఈ క్షేత్రానికి ఒంటిమిట్ట అని పేరు వచ్చినట్లు తెలుస్తోంది.

ఆలయ ముఖ మండపం భక్తులను మైమరిపిస్తుంది. మనోహరమైన శిల్పరాజాలతో కూడిన స్తంభాలు, ప్రాకారాలు, కుడ్యాలు ఈ ముఖమండపంలో భక్తులకు దర్శనమిస్తాయి. ఆయా ప్రాకారాలు స్తంభాలపై రామాయణ మహాభారత గాథలు, దశావతార ఘట్టాలకు చెందిన మనోహరమైన శిల్పరాజాలెన్నో భక్తులకు దర్శనమిచ్చి మైమరపిస్తాయి. వాటిని దర్శించుకున్న భక్తులు ఆలయానికి ముందు కుడివైపునున్న పోతనామాత్యుని మందిరానికి చేరుకొని ఆయనను భక్తితో దర్శించుకుంటారు. బమ్మెర పోతన ఈ క్షేత్రంలోనే మహాభాగవత రచన చేస్తూ గజేంద్రమోక్షంలో “అల వైకుంఠపురంబులో” అనే పద్యంలోని కొన్ని చరణాలు గుర్తుకు రాక నిలిపివేయగా శ్రీరామచంద్రుడు వచ్చి తాళపత్రగ్రంథాలను పూర్తిచేశాడని చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆ కారణంగానే పలికెడిది భాగవతమట, పలికించు విభుండు రామభద్రుండట;” అని భాగవతాన్ని శ్రీరామునికి అంకితమిచ్చారని తెలుస్తోంది. 

జాంబవంతుడు ఒకేరాతిపై ఉన్న సీతారామలక్ష్మణ మూర్తులను ప్రాణప్రతిష్ఠ చేసినట్లు పురాణాలద్వారా అవగతమౌతోంది. పోతనామాత్యుని దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయం వెలుపల వున్న జయవిజయులను దర్శించుకొని ఆ తర్వాత గర్భాలయంలోకి ప్రవేశిస్తారు. గర్భాలయానికి ముందున్న అంతరాలయంలో ఓ ప్రక్క శ్రీమన్నారాయణుడు, ఒక ప్రక్క ఆంజనేయస్వామి వారు దర్శనమిస్తారు. ఇంకోప్రక్క ఆళ్వార్ స్వాములు దర్శనమిస్తారు.
త్రేతాయుగంలో ఇక్కడ మృకండు మహాముని, శృంగి మహాముని యాగాలు, క్రతువులు చేస్తున్నప్పుడు రాక్షసులు వచ్చి ఆటంక పరుస్తుండగా ఈ దండకారణ్య ప్రాంతానికి రాముల వారు కోదండము, పిడిబాకు, అమ్ములపొదితో వచ్చారు కనుక కోదండరామ స్వామి అని అంటారు. అప్పటికింకా సీతాపహరణం జరుగలేదు. ఆంజనేయస్వామి కనపడకముందే రాముల వారు వచ్చారు కనుక అంజనేయుల వారు గర్భగుడిలో లేరు. ఇక్కడి స్వయంభూ విగ్రహాలను ద్వాపరయుగంలో జాంబవంతుడు ప్రతిష్ఠ చేసి పూజలు చేశాడని చెప్తారు. 

అయ్యలరాజు తిప్పరాజు, అయ్యలరాజు రామభద్రుడు, బమ్మెర పోతన, తాళ్ళపాక అన్నమాచార్యులు, పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి, ఉప్పుగుండూరు వేంకటకవి, ఈమాం బేగ్, మాల ఓబన్న వంటి ఎందఱో మహనీయులు స్వామివారి ఆశీస్సులు తీసుకొని తరించారని తెలుస్తోంది. 
భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న రామలింగేశ్వర స్వామిని చేరుకొని స్వామిని భక్తితో పూజిస్తారు. అనంతరం ఆలయం బయట స్వామి ఆలయానికి ఎదురుగా మాలఓబన్న మండపం భక్తులకు దర్శనమిస్తుంది. పూర్వం మాల ఓబన్న అనే భక్తుడు తన భక్తితో స్వామివారిని మెప్పించి ఆయన సాక్షాత్కారానికి పాత్రుడయ్యాడు అని పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆతరువాత భక్తులు సమీపంలో ఉన్న సంజీవరాయుని మందిరానికి చేరుకుంటారు. అతిపురాతనమైన ఈ ఆలయంలో ఆంజనేయస్వామి వారు ముకుళిత హస్తుడై భక్తులకు దర్శనమిస్తారు. అలాగే స్వామి ఇక్కడ సంజీవరాయునిగా భక్తులచేత నిత్య నీరాజనాలందుకుంటున్నారు. సంజీవరాయుని దర్శించుకున్న భక్తులు అనంతరం సమీపంలో కొండపై ఉన్న వావిలి కొలను సుబ్బారావు మందిరానికి చేరుకుంటారు. శ్రీరామ భక్తుడైన సుబ్బారావు ఈ ఆలయ అభివృద్ధికి విశేషంగా కృషి చేసి శ్రీరామచంద్రుని కృపకు పాత్రులయ్యారని చెప్తారు. గర్భాలయంలో సుబ్బారావు శిలా ప్రతిమ ఒకటి భక్తులకు దర్శనమిస్తుంది.


Please Share this


First Indian Women to be World No.1 Badminton Player

Saina Nehwal creates history, becomes First Indian Shutter to reach world no. 1 Ranking.
You make India Proud!


KCR at His Farm house-Gajwel

KCR at His Farm house-Gajwel

KCR at His Farm house-Gajwel

Rare Photo-ChandrbabuNaidu-YSR-Gulam Nabi Azad

Rare Photo-ChandrbabuNaidu-YSR-Gulam Nabi Azad

Rare Photos-KCR_with_PJR

Rare Photos-KCR_with_PJR

Meaning of National Anthem

Meaning_of_National_Anthem

Pachhala Someshwara Swamy Temple In Panagal,Nalgonda

Panagal_Pachhala_Someshwara_Swamy_Temple_in_Nalgonda

Pachhala Someshwara Swamy Temple In Panagal,Nalgonda.
It is Located In Panagal.
From Nalgonda 5 Kms Distance Only.
From National Highway-9 take right at Kattangur Town.from There only 10 Kms.

Temple specialty is 24 hours a day a shadow framed with help of two pillars as like as one of the pillar on the Lord Shiva.
This temple is constructed by Kakatiyas In the 12 th century.
This temple is constructed with the mix of  vasthu,mathematics,light and shadow theory.



Google Map Address:




Driving In India And America...LOL

Driving In India And America...LOL

Food Menu at Indian Parliament....

Food Menu at Indian Parliament....

Awareness for Sinflu

Awareness for Sinflu

Bharath Ratna for NTR

Bharath_Ratna_for_NTR

YSR-A Great Leader

YSR-A Great Leader